కలకత్తాలో వయసున్నంత కాలం వ్యభిచారం చేయించి ,వయసుడిగాక కిడ్నీలు ,కాలేయాలు అమ్ముకుంటారట!



   

                                ఈ దేశంలో వామ పక్ష వాదుల ఏలుబడిలో ఎక్కువ కాలం ఉన్న నగరం కలకతా నగరం . అభివృద్దిలో ఆ  నగర ర్యాంక్ ఎంతో  కాని అమానవీయ పనులకు మాత్రం మొదటి స్తానం ఆక్రమిస్తుంది అట . ఇక్కడ అమానవీయ పనులు అంటే అమ్మాయిల అక్రమ రవాణ , వారిని బానిసల కంటే హీనంగా చూస్తూ , వారి రక్త మాంసాలతో వ్యాపారం చెయ్యడం ! కేవలం వ్యాపారం చెయ్యడమే కాదు వారి వయసు ఉడిగి పోయాక  , వారి కిడ్నీలు , కాలేయాలు అమ్ముకునే రాక్షసులు కలకత్తా నగరం లో ఉన్నారు అంటే భారత జాతి యావత్తు సిగ్గుతో తల వంచుకోవలసిందే . ఈ మాట అన్నది సాక్షాత్తు మన రాష్ట్ర ప్రదాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా గారు.నిన్న హైదరాబాద్లో జరిగిన "మనుషుల అక్రమ రవాణా " అనే అంశం పై జరిగిన చర్చ సందర్బంలో అయన ఈ  విషయం తెలియ చేసారు .

   పై విషయంలో కేవలం కలకత్తా రాక్షసులదే కాదు,తమ దేశపు   ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తుంటే దానిని నిరోదిo చలేని బంగ్లాదేశ్ ప్రబుత్వానికి ఈ పాపంలో బాగం ఉంది . పశ్చిమ బెంగాల్ సరిహద్దులలోని బంగ్లాదేశ్ నుంచి పేదింటి ఆడపిల్లలను సినిమాలో చేర్పిస్తామానో , ఉపాది చూపిస్తాం అనో , ప్రేమ పేరుతోనో  మబ్య పెట్టి , కలకత్తాకు తీసుకు వచ్చి వారిని వ్యభిచార గృహాలకు అమ్మివేస్తారట . వారితో వయసు ఉన్నంతకాలం వ్యభిచారం చేయించి దబు గడిస్తారు అట . కొంచం వయసు ఉడిగి పోయాక వారి కాలేయాలు , కిడ్నీలు అమ్ముకుoటారట . ఇంత  దారుణాలు ఏ  కాలం లోనైనా ఉన్నాయా ? కాని అబ్యుదయ వాదులం అని చెప్పుకునే వారికీ ఈ అభ్యుదయ నగరంలో జరుగుతున్నవి అస్సలు కాన రావు .


  పోనీ అమ్మాయిల అక్రమ రవాణాలో మన రాష్ట్రం ఏమన్నా తక్కువ తిందా అంటే,  లేదు ! వారి తర్వాతి స్తానం మనదే నట . కాకపొతే కాలేయాలు , కిడ్నీలు అమ్ముకునే స్తాయికి ఇంకా రాలేదు కాబోలు .స్త్రీల అభ్యుదయం గురించి నిత్యం ఊక దంపుడు ఉపాన్యాసాలు ఇస్తూ , ఎప్పుడో గతించిన "మనువు" ను పదే పదే అడి పోసుకుంటున్న స్త్రీ వాదులకు , అమ్మాయిల శరీరాలు తో వ్యాపారాలు చేసే బేహారులు  , ప్రేమ పేరుతొ వంచనలకు పాల్పడుతున్న మోసగాళ్ళు కనపడడం లేదు . ఎంత సేపు మన సంస్కృతిని నాశనం చేసే బావజాలాలను ప్రబోదించడమే తప్పా , ఆ బావజల పలితంగానే లక్షలాది మంది ఆడబిడ్డలు తమ బ్రతుకులు చీకటి గృహాలలో నాశనం చేసుకుంటుంటే వారి గురించి పట్టించుకున్నారా? వారి ఉసురు తప్పకుండా బాద్యులందరికి తగిలి తీరుతుంది . ఈ రాక్షసులను సంహరించే  కలకత్తా కాళి  వస్తుంది . ఆ రోజులు కూడా ఏంతొ  దూరంలో లేవు .
 
           ఏది ఏమైనా ఒక మాట మాత్రం నిజం . స్త్రీల విషయంలో చీకటి యుగం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా అది మన ప్రజాస్వామ్య యుగమే .పాలనా పగ్గాలు పురుషుల చేతిలో ఉన్నా , స్త్రీల చేతిలో ఉన్నా , వారి పరిస్థితిలో మార్పు లేదు  దానికి కారణం ఆధునిక స్వేచ్ఛ పేరుతొ  స్త్రీలను ఆకర్షించి , చివరకు వారిని ఈ  మురికి కూపం లోకి లాక్కువస్తున్న ఆధునిక వ్యాపార వాదం అందుకు సహకరిస్తున్న మై ఛాయిస్ భావజాల  ఫలితాలే . ఈ  సో కాల్డ్ ఆధునిక స్వేచ్చా యుగంలో  జరుగుతున్న స్త్రీల మిద అమానవీయ చర్యలును నిరోదించ లేని వారికి పూర్వ కాలపు "మనువు" ను విమర్శించే నైతిక అర్హత లేదు కాక లెదు.
                                                      (23/3/2014 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన