"అందాల "పేరంటాల పల్లి " ని అదృశ్యం చేస్తున్న వారు రాక్షసులేనా ?

                                                         


పేరంటాల పల్లి ! ఖమ్మం జిల్లాకు ఉన్న ఏకైక అందమైన నదీ పరివాహక టూరిజం స్పాట్ . ఇక్కడకు నిత్యం అనేక వందల మంది రాష్ట్రం లోని వివిధ జిల్ల్లాల నుండి మాత్రమె కాక, పొరుగు రాష్ట్రాలనుండి కూడా  వచ్చి ఇక్కడి రమణీయ ప్రక్రుతి కి పరవశించి పోతుంటారు . అలా ఈ ప్రాంతం బోట్ టూరిజం కి ప్రసిద్ది గాంచింది . మరి అలాంటి ప్రాంతం ఇంకా కొద్ది రోజులలో అధికారికంగా సిమాంద్ర రాష్ట్ర ప్రాంతంలో కలిపివేయ్యడమే కాకుండా పూర్తిగా గోదావరి లో ముంచి వెయ్యడానికి "సోనియా సర్కార్" సిద్ద మయింది .

     భద్రా చలం పరమ పుణ్య దామం . తెలంగాణ ప్రజలు రాముల వారిని తమ రాష్ట్రంలోనే ఉంచాలని , రాముల వారికి హైదరాబాద్ సంస్తానానికి ఉన్న చారిత్రిక నేపద్యం,రామాలయ సంప్రాదాయాల రిత్యా అది అనివార్యం కాబట్టి , కేవలం రామ క్షేత్ర్రాలు ను మాత్రమె తెలంగాణా లోని ఖమ్మం జిల్లాలో ఉంచి , మిగాతా ప్రాంతం అంతటిని "పోలవరం ముంపు ప్రాంతాలు" పేరుతొ సిమాంద్రా లో కలిపి వేస్తున్నారు . దిని కోసం ఆర్డినెన్స్ జారి చెయ్యటానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది . ప్రస్తుతం ఉన్న పరిస్తితిలో అయితే అటు గోదావరి జిల్లాలకు   , ఇటు ఖమ్మం జిల్లాకి టూరిజం ద్వారా ఆదాయం , ఉపాది కల్పిస్తున్న" పేరంటాల పల్లి " టూరిజం కేంద్రం వారి నిర్ణయంతో పూర్తిగా మునిగి పోయే పరిస్తితి.
                                                         


   ఖమ్మం జిల్లాలో "పేరంటాల పల్లి " టూర్   కూనవరం గ్రామం నుడి కాని , పోచారం గ్రామం నుండి కాని ప్రారంభం అవుతుతుంది . భద్రా చలం వచ్చిన యాత్రికులు అక్కడ శ్రీ రాముల వారి దర్సన అనంతరం రోడ్డు మార్గం ద్వారా కూనవరం చేరుకుంటారు . అక్కడ నుండి బోట్  ప్రయాణం మొదలై , కొండల నడుమ గోదావరిలో విహరిస్తూ , పేరంటాలు పల్లి,ఆ ప పాపి కొండల వరకు వెళ్లి అక్కడి కమనీయ దృశ్యాలు చూసి పులకించి పోతుంటారు . అటు రాజమండ్రి వచ్చె యాత్రికులు సైతం రాజమండ్రి నుండి బోట్ ప్రయాణం ద్వారా పేరంటాల పల్లి వరకు వస్తుంటారు . ఈ విదంగా ఇటు తెలంగాణా ప్రాంతానికి  , అటు సిమాంద్ర ప్రాంతానికి ఉపాడితో కూడిన టూరిజం రెండు ప్రాంతాలకు "సమ న్యాయం" చేస్తుంది . కాని ఇప్పుడు సోనియా సర్కార్ నిర్వాకాలు వలన టూరిజం జరిగే ప్రాంతం మొత్తం గోదావరి జిల్లాలకు బదిలి చెయ్య బడడమే కాక అసలు చుట్టూ ప్రక్కల ప్రక్రుతి అందాలు ను గోదావరి లోనే ముంచేయ బోతున్నారు . 
                                                      
  భద్రాచలం డివిజన్ లోని చింతూరు , కూనవరం, V.R పురం మండలాలు పూర్తిగాను ,   భద్రాచలం మండలంలోని ఒక్క భద్రా చలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా మండలాలు , అలాగే పాల్వంచ డివిజన్ లోని కుక్కునూరు , వేలేరు పాడు మండలాలు పూర్తిగా "ముంపు ప్రాంతాలు " గా నిర్ణయించారు . ఈ  ప్రాంతాలు అన్ని గిరిజన సంస్కృతీ కలిగిన అందమైన అటవీ ప్రాంతం . పూర్వం శ్రీ రాముల వారు తిరుగాడిన ప్రాంతం . మరి అటువంటి ప్రాంతాన్ని ఒక ఆనకట్ట నిర్మాణం కోసం పూర్తిగా గోదావరిలో ముంచి వెయ్యడం ప్రక్రుతి ప్రేమికులను కలచి వేసే అంశం . పూర్వ కాలం లో వృత్రా సురుడు అనే రాక్షసుడు ఇలాగే ఆనకట్టలు కట్టి , ప్రక్రుతి అసమతుల్యకు కారణ బూతుడు అయ్యాడని , దేవత తల రాజు ఇంద్రుడు "వజ్రాయుధం " తో అతన్ని సహరిoఛి , ఆతను  నిర్మిoచిన ఆనకట్టను బద్దలు కొట్టి నీటిని విడుదల చేస్తాడు అని గాద . ప్రస్తుతం కేంద్రం లోని కొంత మంది పెద్దలు చేసే పనులు చూస్తుంటే వీరంతా అ రాక్షస  వృత్రాసురుడు వారసులే అనిపిస్తుంది .ఇలా ప్రక్రుతి ద్వంసానికి పదకాలు రచించే వారు ఖచ్చితంగా రాక్షసులే . వారు  తప్పకుండా రాముల వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు . మరి అ నాడు  ప్రక్రుతి మాతను రక్షించడాని కి "వజ్రాయుధం " ప్రయోగించాల్సి వచ్చింది . మరిపుడు భద్రాచల రాములవారి "రామ భాణం " ఈ నవీన రాక్షసుల భరతం పట్టుదేమో చూదాం .

     భద్రాచల పరిసర ప్రాంతాలు సిమాంద్ర లో కలపడాన్ని సవాలు చేస్తూ K.C.R గారు సుప్రీం కోర్టుకు వేతానని ప్రకటించారు . సంతోషం. లేకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నటికి K.C.R  గారిని , అయన పార్టిని క్షమించరు . అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతాను అన్నారు. పోనీ , ఈ  విదంగా అయినా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో , రాష్ట్ర విభజన విషయంలో ఉన్న చట్ట వ్యతిరేక అంశాలు మిద ఒక స్పష్టత రావడమే కాక భవిష్యత్ లో ర్రాష్ట్రాల ఏర్పాటుకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఏర్పడే అవకాశం  ఉంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన