"నపుంసకుడి చేతిలో రంభ" లాంటి పాలన అంటే ఇదే మరి! .

                                                                      
  ఏదయినా ఒక ఘోరం జరగగానే, దాని గురించి ప్రజలు, మీడీయా ఉవ్వెత్తునా స్పందించడం, అది చూశి హడావుడిగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత చట్టం తన పని ఎలాగు తాను చేసుకు పోతుంది కాబట్టి,అందరూ దానిని మర్చి పోయి మరొక సంఘటణ జరిగే దాక, పట్టిచ్చుకోవక పోవడం మామూలైపోయింది.

  మన దేశంలో "మానబంగాలు, దోపిడీలు" సాదారణ నేరాలై పోయాయి. దేశ రాజదానిలోనే అత్యంత కిరాతకంగా ఒక అబలని "గాంగ్ రేప్" చేసి కుక్కల్ను విసిరేసినట్లు, బస్సులోంచి విసిరేశారు అంటే అసలు నేరగాళ్ళకు, ప్రభుత్వం అన్నా, పోలిస్లు అన్నా భయం ఉందా? అహ ఉందా అని?

 "రాజు నిద్రపోతున్నా, రాజ్య దండం రాజ్యాన్ని పహారా కాస్తుండాలి" అనేది చాణక్య రాజ్య నీతి."తమ వాటాలు తమకు ముడితే  చాలు, పట్టపగలు మర్డర్ చేశినా పర్వానై" అనేది నేటి దండణాదికారుల నీతి.అందుకే నేరస్తులు ఇంతగా రెచ్చి పోతున్నారు. డబ్బులు వెదజల్ల గలిగిన వాడు, ఎంత పెద్ద నేరం చేసినా, సుళువుగానే తప్పించుకుంటున్నాడు. ఒక వేళా వాడు జైళ్లల్లో ఉండాల్సి వచ్చినా అక్కడవారి" రాజబోగాలకు" కొదువేమి లేదు. అందుకే వాళ్ళకి రాజ్యం అన్నా రాజ్య దండన అన్నా బొత్తిగా భయం లేకుండా పోయింది.

  మనకు కావాల్సింది "మంచివారు" కాదు, సమర్దులు. సమర్దులయినా పాలకులు బారత దేశానికి తక్షణ అవసరం. "గుజరాత్ లో గుట్కా నిషేదించిన దమ్ము"  లాంటిది డిల్లి గద్దె మీద కూర్చునే వారికి ఉండాలి. నేరం జరిగాక ఎంతగొప్పగా విచారణ జరిపారన్నది కాదు, అసలు నేరం చెయ్యడానికే గుండెల్లో గుబులు పుట్టాలి.అటు వంటి గుబులు పుట్టించే వాడు కావాలి, వారే రావాలి. అంతవరకు ఎంత గొప్ప చట్టాలు ఉన్నా, ఎంత సమర్దులైనా పోలిస్ అదికార్లు ఉన్నా అంతా "నపుంసకుడి చేతిలో రంభ"లా అలంకార ప్రాయమే. పాలనంతా "మూడు మర్డర్లు, ఆరు మానబంగాలే".        

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన